
పంజాబ్కు చెందిన వ్యక్తి స్టూడెంట్ వీసాపై రష్యా వెళ్లాడు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో అతడ్ని బలవంతంగా ఆర్మీలోకి చేర్చుకున్నారు. ఎలాంటి మిలిటరీ ట్రైనింగ్ లేని ఆ వ్యక్తిని యుద్ధభూమికి పంపారు. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన 25 ఏళ్ల బూటా సింగ్ 2024 అక్టోబర్ 24న ఢిల్లీకి చెందిన ఏజెంట్ ద్వారా రష్యా వెళ్లాడు. ఆ ఏజెంట్ అతడి కుటుంబం నుంచి రూ. 3.5 లక్షలు వసూలు చేశాడు.