
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.
వెంటనే ఆమెను చికిత్స కోసం మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా ఇక్కడ చికిత్స పొందుతు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దస్సి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ స్థానిక నేతలు హెచ్చరించారు.