
ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగాల్లో కోతలు విధించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మళ్లీ లేఆఫ్స్ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లాభదాయకతను పెంచుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాత్మక మార్పుల కారణంగా.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తోంది.