మూసీ నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘మూసీ ఇన్వైట్స్’ పేరిట హైదరాబాద్ తాజ్కృష్ణలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టు ఆవశ్యకతపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

