
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తాజాగా మరో పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చి యార్డులో ఆయన నిర్వహించిన పర్యటనను ప్రస్తావిస్తూ నమోదు చేయబడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ పర్యటన జరిగిందని, కోడ్ను ఉల్లంఘించారని పోలీసులు అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా యార్డుకు వచ్చి హడావుడి చేశారని ఆరోపణలున్నాయి.