
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. సిఎం చంద్రబాబు ఎస్పితో ఫోన్లో ఈ ఘటనపై ఆరా తీశారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చంద్రబాబుకు ఎస్ పి తెలిపారు. ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిఎం పేర్కొన్నారు.