
మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారు జామున భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం, బుధవారం మధ్య రాత్రి 1.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మౌని అమావాస్య నాడు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమం లోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయనేది భక్తుల విశ్వాసం.