
కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ అలజడి రేపుతోంది. మూడు జిల్లాల్లో పబ్లిక్ ఈవెంట్స్పై నిషేధం విధించారు. ఈ వైరస్ కారణంగా మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని జులై 1న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయింది,మరొకరు చికిత్స పొందుతున్నారు. యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.