అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. టిడిపి రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు సవాల్ విసిరారు. మదనపల్లి మెడికల్ కాలేజీ వద్ద వైసిపి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి కార్యకర్తలు దాడులకు దిగారు. తమపై టిడిపి కార్యకర్తలు దాడులు చేశారని వైసిపి నాయకులు ఆరోపణలు చేశారు.

