మత మార్పిడి రాకెట్లను నిర్మూలించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇతర ఆధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించాలని ఉత్తర్ప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సోషల్ మీడియా, సైబర్ నేరాలపై కఠినమైన నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా కుల, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని కోరారు.

