
వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికీ ఫిర్యాదు చేశారు. మేడారం ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 71 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కాగా ఈ మేరకు టెండర్లను పిలవడం జరిగింది. అయితే ఈ టెండర్ను తన అనుచరునికి ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.