ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యం చేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవహారాలకు తన తండ్రిని దూరంగా ఉంచాలని సదరు మంత్రిని సీఎం గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇకపై పనితీరులో మార్పు రావాలని స్పష్టం చేశారు. మంత్రి తండ్రి చేస్తున్న జోక్యంపై తన వద్ద పూర్తిస్థాయి నివేదికలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు.

