
ఏపీ మంత్రి సవితమ్మకు కోపం వచ్చింది. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.. ఇటీవల పెనుకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా పెనుకొండకు చెందిన ఓ అధికారి ఆమెకు స్వాగతం పలుకుతూ బొకేను అందించారు. అయితే బొకే తీసుకున్న సవిత.. దానిని కోపంతో వెనక్కి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సవిత తీరును కొంతమంది నెటిజనం తప్పుబడుతున్నారు.