
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. అదే తరహాలో బీహార్లోనూ కుట్రలు చేసే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల సంఘం ప్యానెల్ నియామకాలతోనే బీజేపీ తన పన్నాగాలు మొదలుపెడుతుందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేర్చడం, ఓటింగ్ శాతం పెంచడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాహుల్ చేసిన ఈ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.