బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోరంగా ఓడిపోయింది.
ఈ ఫలితాలతో పీకే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజంతా మౌన వ్రతం పాటిస్తున్నారు. బీహార్లోని భితిహర్వా గాంధీ ఆశ్రమం లో ఈ రోజు మొత్తం మౌన దీక్షలో ఉండనున్నారు. మరోవైపు నేడు బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

