హైటెక్ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రూప్ – 3కి ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయని గ్రూప్ – 3 విజేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకూడదని కోర్టుల్లో కేసులూ వేశారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని తప్పు పట్టారు.

