వింబుల్డన్లో భారత స్టార్స్ ఆశలు రేకెత్తిస్తున్నారు. పురుషుల డబుల్స్లో శ్రీరామ్ బాలాజీ ముందంజ వేశాడు. గురువారం జరిగిన తొలి రౌండ్లో శ్రీరామ్- మిగెల్ రెయ్స్(మెక్సికో) ద్వయం అమెరికా జంటను చిత్తు చేసింది. ఆద్యంతం
ఉత్కంఠగా సాగిన పోరులో లెర్నర్ థియెన్, అలెగ్జాండర్ కొవసెవిక్ ద్వయంపై 6-4, 6-4తో జయకేతనం ఎగురవేసింది. దాంతో, ఈ గ్రాండ్స్లామ్ టోర్నీలో రెండో రౌండ్కు దూసుకెళ్లిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు శ్రీరామ్.

