భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు వడోదరలో వినూత్న సన్మానం జరిగింది.సరికొత్తగా ఆలోచించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ ‘రో-కో’ను ‘ఔట్ ఆఫ్ ది బాక్స్’ స్వాగతంతో ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బాక్స్ లోంచి బయటకు వచ్చి.. పూలగుత్తులను స్వీకరించారు.అనంతరం తమ నిలువెత్తు ఫొటోగ్రాఫ్ మీద విరాట్, హిట్మ్యాన్ సంతకాలు చేశారు.

