
కేంద్ర మంత్రికి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని వివరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై రాష్ట్ర ప్రజల్లో, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, తమ ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారని ఉత్తమ్ కుమార్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామని చెప్పారు.