బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై హత్యాకాండలు ఆగడం లేదు. సోమవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే మరో హిందూ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే మృతిచెందగా, దుండగులు పరారయ్యారు. బంగ్లాదేశ్లోని జస్సోర్ జిల్లా కేశబ్పూర్ ఉపజిల్లా వార్డు నెంబర్-17లోని కొపలియా బజార్లో ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మృతుడు కేశబ్రూర్ ఉపజిల్లాలోని అరువా గ్రామానికి చెందిన రాణాప్రతాప్ (45)గా గుర్తించారు

