రిలయన్స్ కమ్యూనికేషన్స్తో పాటు ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీని “ఫ్రాడ్” జాబితాలో చేర్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిబిఐకి కూడా ఫిర్యాదు చేసే ప్రక్రియలో SBI ఉందని సోమవారం పార్లమెంటుకు సమాచారం అందింది. ఈ సంస్థలను జూన్ 13, 2025న మోసం రిస్క్ మేనేజ్మెంట్పై RBI మాస్టర్ డైరెక్షన్స్, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్, నిర్వహణపై బ్యాంక్ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం మోసంగా వర్గీకరించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

