
భారత్లోని 100 మంది సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్ అంబానీ మొదటి స్థానం సొంతం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్ డాలర్లతో గౌతమ్ ఆదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్కు చెందిన సావిత్రి జిందాల్ 40 బిలియన్ డాలర్లతో మూడోస్థానంలో, టెలికా దిగ్గజం సునీల్ మిట్టల్ 34 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, టెక్ బిలియనీర్ శివ నాడార్ 33 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.