ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని ఈ ఎగుమతులకు అడ్వైజర్గా నియమించుకోవడంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సుమారు ఏడాది కాలంగా 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులోనే ఉండిపోయాయని, అవి పురుగులు పట్టి ముక్కిపోతున్నాయని సభ దృష్టికి తెచ్చారు.

