ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరపనుంది. రెండు వారాల్లో తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. స్పీకర్ కు చివరి అవకాశం.. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, 2 వారాల్లో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.

