
ప్రేమ సౌధం తాజ్ మహల్ను వీక్షించాలనుకునే పర్యాటకులకు గుడ్న్యూస్. వరుసగా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్రవేశం కల్పించనున్నారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 370వ ఉర్సు సందర్భంగా షాజహాన్, ముంతాజ్ ఒరిజినల్ సమాధులను చూసేందుకు వీలుంటుంది. ఇతర సమయాల్లో సందర్శకులకు ఈ అవకాశం ఉండదు.