
కంగ్టి మండల పరిధిలోని ఓ గిరిజన తండాకు చెందిన నిఖిత భాయ్కు ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్కు సమాచారం అందించారు. తండాకు సరైన రోడ్డు లేకపోవడం, ఉన్న రోడ్డు బురదమయంగా మారడంతో.. అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం కష్టమైంది. చేసేదేమీ లేక నిండు గర్భిణి తండా నుంచి 1.5 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. పురిటి నొప్పులు భరిస్తూనే ఆమె బురదలో నడిచింది. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్లో కంగ్టి ఆస్పత్రికి తరలించారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.