ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయి వచ్చిన సమయంలో ఒక్కసారిగా వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే హేమలత అనే మహిళ కిందపడగా.. ఆమె కాలిపై నుంచి పవన్ కళ్యాణ్ కారు వెళ్లింది. ఈ ఘటనలో హేమలతకు గాయాలు కాగా.. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

