
2025 ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ (ICC Womens World Cup 2025) 13వ ఎడిషన్గా సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. భారత్తో పాటు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న ఈ ప్రపంచ కప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అత్యున్నత గౌరవాన్ని అందుకుంటుంది. ఛాంపియన్ జట్టు $4.48 మిలియన్లు (సుమారు రూ.40 కోట్లు) బహుమతిని అందుకుంటుంది. ఫైనల్లో రెండవ స్థానంలో నిలిచిన జట్టు $2.24 మిలియన్లు (సుమారు రూ.20 కోట్లు) అందుకుంటుంది.