
హైదరాబాద్ నగరంలో వర్షాకాలం మొదలవడంతో నాలాల సమస్య తీవ్రరూపం దాల్చింది. నాంపల్లి ప్రాంతంలో నాలా సమస్య పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహించిన స్థానికులు, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమస్య పరిష్కారం కోసం స్థానికులు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.