
2020 మే 7న విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లో సంభవించిన స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం 26 మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ ప్రమాదంలో గాయపడిన వందలాది మంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కంపెనీ నుండి ఎటువంటి సహాయం లభించకపోవడంతో, బాధితులు దక్షిణ కొరియాలోని సియోల్ లోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచాయి.