
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతుంది. రైతు భరోసా కింద రూ. 9 వేల కోట్లను 9 రోజుల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే నేడు రైతు భరోసా కింద మరో 905.89 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం 5 రోజుల లోనే 7310.59 కోట్లు విడుదల చేసామని…ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.