
ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ బూటకపు హామీలు ఇచ్చి పేదల దగ్గర భూముల్ని కాజేసిందని, ‘ల్యాండ్ ఫర్ స్కామ్’ను ఉదహరిస్తూ ప్రధాని మోడీ ఆర్జేడీని తూర్పారబట్టారు. ఈ పరిస్థితుల్లో తూర్పు భారతం అభివృద్ధికి వికసిత్ బీహార్ కీలకమని ఆయన పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం మోతిహరిలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ‘బనాయేంగే నయా బీహార్, ఫిర్ ఏక్బార్ ఎన్డిఏ సర్కార్ ’ (మరోసారి ఎన్డిఎ ప్రభుత్వం అధికారం లోకి వస్తే నూతన బీహార్ను నిర్మిస్తాం) అనే నినాదాన్ని ఇచ్చారు.