బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీ ఆఫీస్కు వెళ్లి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, జాగృతి కార్యకర్తలపై దాడి చేయించి, కాల్పులు చేయించిన ఘటనపై ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మా జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్ననా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను

