
ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ తిలక్ వర్మ.. మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్ను ముఖ్యమంత్రి సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహూకరించారు.