ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న త్రిపుర విద్యార్థిని స్నేహా దేవ్నాథ్ జూలై 7న కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసి సరాయి రోహిల్లా రైల్వే స్టేషన్కు వెళ్తున్నానని చెప్పింది. సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద ఆమెను క్యాబ్ డ్రైవర్ దింపినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా, ఆమె ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా, స్నేహ రాసిన సూసైడ్ నోట్ పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

