కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఓ మంత్రి సహా పది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మిగతా రెండున్నరేళ్లు తమ నాయకుడిని సీఎంని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

