
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్దెత్తున డ్రోన్స్ దాడులకు పాల్పడింది. ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు పాల్పడటం కూడా ఇదే మొదటిసారి. 40 కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. సైబీరియాలో తొలి డ్రోన్ దాడిని రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంత గవర్నర్ ధృవీకరించారు. సైనిక విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి సైన్యం, పౌర చర్య దళాలు ఇప్పటికే సమీకరించారు.