తమిళనాడు ఎన్నికల వేళ అధికార డీఎంకే తాయిలాలు ప్రకటించింది. మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. రైతులకు ఉచితంగా పంపుసెట్లు ఇస్తామన్నారు. రూ.5 లక్షల వరకు వైద్య బీమాతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు పిల్లలకు అల్పాహార పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఇల్లతు అరసి పథకం కింద వాషింగ్ మెషీన్, టీవీ, గ్రైండర్, మైక్రోవేవ్ లాంటివి కొనుక్కునేందుకు మహిళలకు రూ.8వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.

