
కేంద్ర ప్రభుత్వం టైప్-1 మధుమేహం చికిత్స కోసం 8 రాష్ట్రాల్లోని 14 ఆసుపత్రులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ టైప్-1 డయాబెటిస్ బాధితులకు ఉచితంగా ఇన్సులిన్.. ఇతర అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. ఇన్సులిన్ కోసం నెలకు సుమారు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఖర్చు అవుతుందని.. అయితే ప్రభుత్వం ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా ఉచితంగా మందులను అందించనున్నారు.