
ప్రవాసంలో ఉన్న టిబెటన్ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ లోబ్సాంగ్ సంగే సంచలన విషయం వెల్లడించారు. చైనాతో భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం భారతీయ రాజకీయనేతలను ప్రభావితం చేసేందుకు చురుకుగా ప్రయత్నిస్తుంటుందని, చివరకు ప్రభుత్వ మార్పుకు సైతం ప్రణాళిక వేస్తుందని అన్నారు. ‘ఎలైట్ -ఆప్షన్ అనేది చైనా అనాదిగా అనుసరిస్తున్న వ్యూహం’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.