
ఈడీ అధికారులు చెన్నై గ్రీన్వేస్ రోడ్లో ఉన్న మమ్ముట్టి కంపెనీ కార్యాలయంపై దాడి నిర్వహించారు. మొత్తం ఎనిమిది మంది ఈడీ అధికారులు, CRPF సిబ్బందితో కలిసి ఈ సోదాలు చేపట్టారు. ఈ దాడులు లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతి మరియు విదేశీ కరెన్సీ లావాదేవీల దర్యాప్తులో భాగంగా నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. కోచ్చి జోనల్ కార్యాలయం కూడా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాల్లో ఒకేసారి దాడులు చేసింది.