ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా రూపుదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్.. నేడు మెల్బోర్న్లో బూపా ఆసియా పసిఫిక్ సీఓఓ బిజల్ సేజ్పల్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఐటీ, డిజిటల్ హెల్త్కేర్కు ఉద్భవిస్తున్న హబ్గా ఉన్న విశాఖపట్నంలో ఒక గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ను స్థాపించాలని లోకేష్ గ్లోబల్ హెల్త్ ఇన్సూరెన్స్ దిగ్గజమైన బూపాను ఆహ్వానించారు.

