
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. గతంలో ఓ సారి ఏసీబీ ఈ కేసు అంశంలో ప్రశ్నించింది.
అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ, హఠాత్తుగా ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లోనే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.