
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 సంవత్సరం వరకు ఆరు సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.ఈ పథకం దాదాపు రూ.8,000 కోట్ల పెట్టుబడిని తీసుకువస్తుందని.. దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేల ఉద్యోగాలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. ఈ పథకం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)లో భాగంగా ఉంటుంది.