
వైసీపీ ప్రభుత్వంలో సినిమా నటులకు అవమానం జరిగిందని డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదానికి మూలమైన కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలగించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.