
మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డీఎస్సీ వేదికపై టీచర్లు అడిగిన ప్రశ్నకు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనని ఐఏఎస్ చదవాలని కొందరు చెప్పారని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో అంత ఓపిక తనకు లేదని చెప్పుకొచ్చారు. తన చదువు అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. అందుకే తానే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.