
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో భేటీ అవుతారు.