
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తొలి పబ్లిక్ ఆఫర్ ( ఐపీఓ)లో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,607 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఈ నెల 7వ తేదీన ప్రారంభమవుతోంది. అక్టోబర్ 9వ తేదీ వరకు ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిగా రూ.1080 నుంచి రూ.1140గా నిర్ణయించారు. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రమోటర్లు తమ వాటాను విక్రయించనున్నారు.