ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితికి ఎంజీఎం ఘటన అద్దం పడుతుంది. వేర్వేరు సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చి, పరీక్షలకు తరలిస్తున్నారు. పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలించాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

