
తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వెల్లడించారు. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధనా సిబ్బంది కొరత, స్కాలర్షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేసిన ఫలితం లేదన్నారు. టీ జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఓ ప్రకటన విడుదల చేశారు.